జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లాపూర్ మండలం మొగిలిపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ట్రాక్టర్లో 15 మంది మహిళలు ప్రయాణిస్తుండగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
.webp)