Home Latest News దేవాలయ ప్రాంగణంలో సాధువు గంజాయి సాగు | సంగారెడ్డి జిల్లా| నారాయణఖేడ్ మండలం| పంచగం గ్రామం| DTF ఎక్సైజ్ సిబ్బంది| ఆంటీ నర్సయ్య మహరాజ్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| తెలంగాణ పోలీసులు| తెలంగాణ ఎక్సైజ్ శాఖ – Andhra Waves

దేవాలయ ప్రాంగణంలో సాధువు గంజాయి సాగు | సంగారెడ్డి జిల్లా| నారాయణఖేడ్ మండలం| పంచగం గ్రామం| DTF ఎక్సైజ్ సిబ్బంది| ఆంటీ నర్సయ్య మహరాజ్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| తెలంగాణ పోలీసులు| తెలంగాణ ఎక్సైజ్ శాఖ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


భక్తి బోధనలు చేస్తూ, గుడిలో పూజలు నిర్వహించి గ్రామ ప్రజలకు గురువుగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి అసలు రూపం బయటపడింది. సాధువు ముసుగులో గంజాయి సాగు, అక్రమ విక్రయాలకు జరుగుతున్న ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగాం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. డీటీఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో దేవాలయ ప్రాంగణంలో భారీగా గంజాయి మొక్కలు, ఎండబెట్టిన గంజాయి, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

పంచాగామ్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి, 0.897 కేజీల గంజాయి విత్తనాలు, రూ.30 వేల నగదు, గంజాయి తూకం వేసేందుకు వినియోగించిన వెయింగ్ మెషిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువను అధికారులు దాదాపు రూ.70 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడు గ్రామం లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలకు “అవుంటి నర్సయ్య మహారాజ్”గా ప్రసిద్ధి చెందాడు.

గుడికి వచ్చే భక్తులకు మంచి మాటలు చెప్ప డం, భక్తి మార్గాన్ని బోధించడం ద్వారా గురువుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అదే గుడి ప్రాంగణం లో పూజల కోసం పూలు పెంచాల్సిన బంతిపూల తోటలో గంజాయి మొక్క లను సాగు చేస్తూ అక్రమ ఆదాయాన్ని సంపాదిస్తున్న విషయం బయటపడటం సంచలనంగా మారింది. పోలీసు విచారణలో నిందితుడు చాలా కాలంగా గంజాయి సాగు చేస్తూ, ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు చేసినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.

పంచాగాం గ్రామంలోనే కాకుండా సమీప గ్రామాల్లో కూడా గంజాయి సాగు సాధరణంగా జరుగుతోందని, గతంలో ఎస్సై సిబ్బంది తనిఖీలకు వెళ్లి దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఉన్న బంతిపూల తోటలో గంజాయి సాగు చేస్తున్న మొక్కలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వ్యక్తిగత నేపథ్యం

గురువుగా చెలామణి అవుతున్న నర్సయ్య మహారాజ్ భార్య మృతి చెందగా, తన ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసినట్టు సమాచారం. అనంతరం తరువాత ఆశ్రమంలో ఉండి తిరిగి గ్రామానికి వచ్చి గుడి పూజారిగా అవతారం ఎత్తాడు. భక్తి పేరుతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి, అదే విశ్వాసాన్ని అడ్డుగా పెట్టుకుని అక్రమ వ్యాప రానికి పాల్పడటం గ్రామస్తులను విస్మయానికి గురిచేసింది.

ఈ ఘటనలో నిందితుడిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, గంజాయి, విత్తనాలతో పాటు నారాయణఖేడ్ ఎస్సైజ్ స్టేషన్‌కు గుర్తించారు. అతడిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంచాగాం గ్రామం స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం కావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామంలో గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird