Home Latest News మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు | మేడారం జాతర| న్యూజిలాండ్ మావోరీ తెగ| సమ్మక్క–సారలమ్మ| మంత్రి సీతక్క| సీఎం రేవంత్ రెడ్డి| మంత్రి కొండా సురేఖా| తెలంగాణ పర్యాటక శాఖ| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు | మేడారం జాతర| న్యూజిలాండ్ మావోరీ తెగ| సమ్మక్క–సారలమ్మ| మంత్రి సీతక్క| సీఎం రేవంత్ రెడ్డి| మంత్రి కొండా సురేఖా| తెలంగాణ పర్యాటక శాఖ| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు | మేడారం జాతర| న్యూజిలాండ్ మావోరీ తెగ| సమ్మక్క–సారలమ్మ| మంత్రి సీతక్క| సీఎం రేవంత్ రెడ్డి| మంత్రి కొండా సురేఖా| తెలంగాణ పర్యాటక శాఖ| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు


పోస్ట్ చేయబడింది జనవరి 26, 2026 7:50PM


ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన “హాకా” నృత్యాన్ని ప్రదర్శించారు. హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.

తెలంగాణ–న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో పంచాయతీ రాజ్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీద ఆధారపడి జీవనం సాగిస్తారని. ఆదివాసీ జీవనం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రతిబింబిస్తాయి.

అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు.సమ్మక్క–సారలమ్మ వనదేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, జిల్లా అధికారులు, అధికారులు నిర్వహించారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird