Home క్రీడలు కాల్షియం మాటలు వేసుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా ? కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి – Andhra Waves

కాల్షియం మాటలు వేసుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా ? కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి – Andhra Waves

by
0 comments
కాల్షియం మాటలు వేసుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా ? కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి


కాల్షియం సప్లిమెంట్స్‌తో కిడ్నీల్లో రాళ్లు వస్తాయా అనే సందేహం అనేక మందికి కలుగుతుంది. వైద్యులను సంప్రదిస్తే మరికొందరు తీవ్ర భయానికి లోనై కనీసం పాలు, పెరుగు తీసుకోవడం కూడా మానేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక పోస్టులు చూసి తీవ్రంగా ప్రభావితం అవుతారు. అయితే, ఈ విషయంలో అనవసరమైన ఆందోళన అవసరం లేదు.

కేవలం కాల్షియం సప్లిమెంట్స్‌తో కిడ్నీల్లో రాళ్లు రావు. సాధారణంగా శరీరానికి తగినంత కాల్షియం అందని సందర్భాల్లో ఎముకల్లోని కాల్షియంపై ఆధార పడాల్సి వస్తుంది. దీంతో, రక్తంలో కాల్షియం స్థాయిల నిర్వహణ కోసం ఎముకల్లో కాల్షియం క్రమంగా కరిగిపోతుంది. మూత్రం ద్వారా ఈ కాల్షియం విసర్జితమవుతుంది. కొన్ని సందర్భాల్లో కాల్షియం గడ్డకట్టి రాళ్లలా మారుతుంది.

ముఖ్యంగా భారతీయుల్లో కిడ్నీ రాళ్ల వ్యాధి ఎక్కువగా ఉంది. మొత్తం జనాభాలో దాదాపు 12 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. కొందరికి జన్యు కారణాల రీత్యా ఈ వ్యాధి వచ్చే ఎక్కువ. ఇతరత్రా కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తున్నాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, పానీయాలు తక్కువగా తీసుకోవడం, ఆహారంలో ఆక్సాలెట్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వంటివన్నీ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పును పెంచుతున్నాయి.

కిడ్నీల్లో ఏర్పడే రాళ్లల్లో అధిక శాతం కాల్షియం ఆధారితమైనవే. అంటే.. ఇవి కాల్షియం ఆక్సాలెట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్‌తో పాటు ఇతర రసాయనాలతో ఏర్పడతాయి. అయితే, కాల్షియం తీసుకోవడాన్ని తగ్గిస్తే ఈ ముప్పు తప్పదని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉంటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం తగ్గుతున్నప్పుడు ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. ఆహారంలో ఉన్న కాల్షియం, పేగుల్లోని ఆక్సాలెట్‌తో బలంగా అనుసంధానం అవుతుంది. ఫలితంగా ఆక్సాలెట్‌ను శరీరం గ్రహించలేదు. దీనితో, శరీరంలో ఈ రసాయన స్థాయిలు తగ్గి కిడ్నీల్లో రాళ్ల సమస్య ప్రమాదం కూడా తగ్గుతుంది.

ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సింది…

అయితే, ఆహారంతో నిమత్తం లేకుండా కాల్షియం తీసుకుంటే మాత్రం శరీరం రెండిటినీ గ్రహిస్తుంది. మూత్రంలో వీటి శాతం పెరుగుతుంది. అంతిమంగా ఇవి కిడ్నీల్లో కాల్షియం ఆక్సాలెట్ రాళ్లుగా మారి సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్‌ను ఆహారంతో పాటు తీసుకోవాలి.

అయితే, కిడ్నీల్లో రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్ శరీరంలో తగినంత నీరు లేనప్పుడు కిడ్నీల్లో కాల్షియం, ఇతర ఖనిజాలు గడ్డకట్టి రాళ్లకు మారే అవకాశం పెరుగుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.

కిడ్నీలో రాళ్ళు అంటే ఏమిటి ? అవి ఎలా ఏర్పడతాయి..

మూత్ర పిండాలలో ఏర్పడిన రాళ్ళని వైద్య పరి భాషలో మూత్రపిండ కాలిక్యులి, నెఫ్రోలిథియాసిస్ లేదా యురోలిథియాసిస్ అని కూడా అంటారు.

భారతదేశంలోని రాళ్ల ప్రాబల్యం సుమారు 12 శాతం ఉండవచ్చు అని చెప్తున్నాయి. ఉత్తర భారత దేశం లో మాత్రం మొత్తం రాళ్ల ప్రాబల్యం 15 శాతం ఉండవచ్చు అని అధ్యయనాలు వల్ల తెలుస్తుంది.

రోగుల్లో రాళ్లు ఉన్న రోగులలో చాల మట్టుకు కాల్షియం రాళ్లు ఏర్పడతాయి (75%-85%). ఇతర రకాల రాళ్లు
యూరిక్ యాసిడ్ రాళ్లు (8%-10%)
స్ట్రువైట్ లేదా అమ్మోనియం రాళ్ళు (7%-8%)
సిస్టీన్ రాళ్ళు (7%-8%)

శరీరంలోని కాల్షియం, ఆక్సలెట్ – యూరిక్ యాసిడ్ పెద్ద మొత్తంలో కలిసిపోయి మూత్రపిండాలలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు రాళ్ళు ఏర్పడతాయి. తక్కువ నీరు వినియోగించినప్పుడు, పేరుకుపోయిన కాల్షియం, ఆక్సలెట్ – యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు రాలేనప్పుడు ఇది జరుగుతుంది.. తరువాత అవి క్రమంగా ఘనీభవించి రాళ్ల రూపాన్ని తీసుకుంటాయి.

మీరు ఆహారం నుండి కాల్షియం తీసుకుంటే, సప్లిమెంట్లతో వచ్చే రాళ్ళు ఏర్పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు, బాదం కాల్షియం మంచి వనరులు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా శరీరం సులభంగా జీర్ణం చేసుకోగలదు..

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

* 👉ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు.వారి కుటుంబంలో రాళ్ల చరిత్ర ఉన్నవారు.యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు. అలాంటి వారు గత వ్యక్తులకు సంప్రదించకుండా కాల్షియం సప్లిమెంట్లను తీసుకోకూడదు.

చాలా మంది మమ్మలిని తరచుగా అడుగుతున్న ప్రశ్న..

బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..?

బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోవు. ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే బీరులో డీహైడ్రేషన్ కలిగించే ఆల్కహాల్ ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల మూత్రం సాంద్రత పెరిగి, రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. బీరులో అక్సలేట్లు, ప్యూరిన్లు అధికంగా ఉండుట వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు…

ఇతర కారణాలు, జాగ్రత్తలు

* 👉 కిడ్నీ రాళ్లకు కారణాలు కిడ్నీ రాళ్లు ఏర్పడటానికి ఒక కారణం లేదు, కానీ కొన్ని అంశాలు దీనికి దోహదం చేస్తాయి. ముందుగా, తగినంత నీరు తాగకపోవడానికి ప్రధాన కారణం. మూత్రం దట్టంగా మారి, పదార్థాలు కలిసి రాళ్లుగా మారతాయి. అలాగే, ఆహారంలో ఉప్పు, ప్రోటీన్, షుగర్ ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదం. ఉదాహరణకు, మాంసాహారం ఎక్కువ తినేవారిలో యూరిక్ ఆమ్లం రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.

కుటుంబ చరిత్ర:

* 👉 మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, మీకు కూడా రావచ్చు.

ఊబకాయం:

* 👉అధిక బరువు ఉండటం వల్ల మెటబలిజం మారి రాళ్లు ఏర్పడతాయి.

జీర్ణ సమస్యలు:

* 👉గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ లేదా ఇన్‌ఫ్లమే బౌల్ డిసీజ్ స్థిర కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది.

జాగ్రత్తలు:

* 👉 విటమిన్ సి అధిక మోతాదులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)రోజుకు 2,000 mg కంటే ఎక్కువ తినకూడదని సిఫార్సు చేసింది.

సోడియం తీసుకోవడం తగ్గించుకోవడం:

సోడియం అధికంగా ఉండే ఆహారంలో రాళ్లను ప్రేరేపిస్తుంది ఎందుకంటే అదనపు సోడియం మూత్రంలో కాల్షియం పెరుగుతుంది. కాబట్టి, కిడ్నీలో రాళ్లను ప్రేరేపించడం ద్వారా సోడియంను పరిమితిలో ఉపయోగించమని సిఫార్సు చేయబడింది. ప్రస్తుతం రోజుకు 2300 mg (మిల్లీగ్రాములు) సోడియం తీసుకోవడం మంచిది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కిడ్నీలో రాళ్లు సోడియం వల్ల ఏర్పడుతుంది, రోజువారీ 1,500 మి.గ్రా.కి పరిమితం చేయడం మంచిది. సోడియం పరిమితి అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులను రాకుండా కూడా ఉపయోగపడుతుంది.

* 👉ప్రతిరోజూ 2 3 లీటర్ల నీరు తాగాలని.

* 👉వీలైతే, టీ, కాఫీ, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించండి.

* 👉మీ ఆహారంలో ఉప్పు తగ్గించండి

* 👉ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి.

* 👉ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి.

* 👉మీ ఆహారంలో పండ్లు – కూరగాయలను చేర్చుకోండి.

* 👉 కిడ్నీ రాళ్లు సాధారణ సమస్య, కానీ ముందుగా గుర్తిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోండి… మీకు ఏమైనా సమస్య ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించండి. -డా.కౌశల్ గోవర్ధన
ఏం.బి.బి.ఎస్, (ఎం.డి, ఇంటర్నల్ మెడిసిన్)
వైస్ చైర్మన్,
శ్రీ రామానుజ సేవా ట్రస్ట్

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird