జనవరి 22, 2026 4:49PMన పోస్ట్ చేయబడింది

భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుచరిత్ర సృష్టించారు. పీవీ సింధు కెరీర్లో 500 మ్యాచుల్లోవిజయం సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డు సృష్టించింది. అలాగే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆరో మహిళా షట్లర్ గా నిలిచారు.
తాజాగా ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్ డెన్మార్క్ షట్లర్ ఫో లైన్ హోజ్మార్క్ జెర్ఫీల్డ్ను 21-19, 21-18 తేడాతో ఓడించి తన 500వ విజయాన్ని అందుకుంది. ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నీలో భాగంగా ప్రిక్వార్టర్ ఫైనల్లో నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సూపర్ విక్టరీ సాధించిన సింధు, క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 4 చెన్ యూ ఫీ రూపంలో గట్టి పోటీని ఎదుర్కోనుంది.
.webp)