పోస్ట్ చేయబడింది జనవరి 10, 2026 4:57PM

డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ పూర్తి సిబ్బంది మంటలర్పారు. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలోని 5న ఓజీసీ యాజమాన్యంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
దాదాపు 20 మీటర్ల ఎత్తులో భారీ అగ్నికీలలు ఎగిసి పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500-600 మంది సురక్షిత ప్రాంతాలకు అధికారులు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. అధికారులు, ఓఎన్జీసీని సమన్వయం చేసి మంటలను అదుపులో ఉంచారు.
ఈ మేరకు మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు. బ్లోట్ఔ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లాౌట్ అదుపులోకి రావటంతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఓజీసీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
.webp)