జనవరి 8, 2026 9:32AMన పోస్ట్ చేయబడింది

రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపుతప్పి మొదట డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే. మృతి చెందిన విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్లో బర్త్డే పార్టీలో పాల్గొని, తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అతి వేగమే ప్రమాదం కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
.webp)