పోస్ట్ చేయబడింది జనవరి 6, 2026 12:30PM

బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం (జనవరి 5) ఒకే రోజు మూడు వేరువేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ఓ మహిళలకు ఘోర అవమానం జరిగింది. ఓ వితంతువుపై గ్యాంగ్, ఓ జర్నలిస్టు, ఓ వ్యాపారి హత్య జరిగింది. సోమవారం (జనవరి 5)ఒక్క రోజే జరిగిన ఈ మూడు ఘటనలూ బంగ్లాదేశ్లో హిందువుల భద్రత గాలిలో దిపంగా ఉందని తేటతెల్లం అవుతున్నాయి. వివరాల్లోకి వెడితో.. కాళీగంజ్లో 40 ఏళ్ల హిందూ వితంతువుపై ఇద్దరు యువకులు సోమవారం (జనవరి 5) సామూహిక అత్యాచారానికి గురైన తర్వాత ఆమెను చెట్టుకు కట్టేసి ఆమె జుట్టు కత్తిరించారు. అదే రోజు సాయంత్రం మరో ఘటనలో జశోర్ జిల్లా కాపాలియా బజార్ లో స్థానిక దినపత్రికకు ఎడిటర్ గా నటించిన జర్నలిస్ట్ రాణా ప్రతాప్ అనే యువకుడిని దుండగులు హత్య చేశారు.
కాపాలియా బజార్ లో ఓ ఐస్ ఫ్యాక్టని కూడా ఉంది రాణా ప్రతాప్ ను అతడి ఫ్యాక్టరీ దగ్గరే దారుణంగా కాల్చి చంపారు. ఇక అదే రోజు రాత్రి నార్సింగ్ లోని బ్రాహ్మడికి చెందిన శరత్ చక్రవర్తి మణి అనే కిరాణాషాపు యజమానిపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. పాకిస్థాన్ లో హిందువులపై ఎడతెగకుండా జరుగుతున్న దాడుల పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణాలపై అక్కడి పోలీసులు నామ్ కే వాస్తే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
