
-పూరి జగన్నాధ్ సృష్టించిన ప్రభంజనం కళ్ళ ముందే ఉంది
-విజయ్ సేతుపతి చిత్రం గురించి ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు
-ఆ విషయంలో పూరి వెనకపడ్డాడా!
-ఫ్యాన్స్ సూటిగా ఏం అడుగుతున్నారు
దర్శక రచయితల్లో తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో ‘పూరిజగన్నాధ్(Puri jagannadh)కూడా ఒకరు. ప్రతి సన్నివేశంలోను, డైలాగ్స్ లోను నటినటుల బాడీ లాంగ్వేజ్ లోను, ఎంటర్ టైన్ మెంట్ లోను పూరి మార్క్ స్పష్టంగా కనపడుతుంది.గత రెండు చిత్రాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పరాజయాలని అందుకోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని విజయ్ సేతుపతి(విజయ్ సేతుపతి)తో ఒక మూవీ చేస్తున్నాడు. ఊహించని కాంబో అయిన అతని చిత్రంపై అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి.
ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే. పక్కా బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ ని త్వరగా పూర్తి చెయ్యడం పూరి స్టైల్. ఆ కోవలోనే విజయ్ సేతుపతి మూవీని కూడా పూర్తి చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి విషయాలని పూరి వెల్లడి చేయలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా అప్ డేట్ వస్తుందేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ నో అప్ డేట్. దీంతో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి అప్ డేట్ అందించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: బెనిఫిట్ షో కి దారేది
సినీ సర్కిల్స్ లో మాత్రం మూవీకి బిజినెస్ చేసే విషయంలో పూరి వెనకపడ్డాడని, ఓటి డీల్ కూడా పూర్తి కాలేదనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon)హీయిన్ కాగా టబు(టబు)మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. ఛార్మి తో కలిసి పూరి నే నిర్మించాడు. ఛార్మి తో కలిసి పూరి నే నిర్మించాడు.

