డిసెంబర్ 31, 2025 1:26PMన పోస్ట్ చేయబడింది

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకు ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒక్క సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తున్నారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒక ప్యాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ ను ఉద్దేశించి కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి గెంటేసిన బీఎస్ఎస్కు చుక్కలు చూపిస్తానని ముందే చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో అవినీతి ఇప్పటికే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాననే విస్పష్టంగా కేటీఆర్ తేల్చేశారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం 2006లో సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను పాల్గొన్నాడు.
తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు. అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత.. తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేసిందని. ఈ సూచన తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకెళ్లినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె, మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చిన సూచన గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైపోయింది.
మహిళలకు ఇచ్చే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఆ నాడే తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.
ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటిదాకా చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న గుర్తింపు తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవ పట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించినట్లైంది.
