డిసెంబర్ 30, 2025 3:32PMన పోస్ట్ చేయబడింది

మహబూబ్నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టు అయిన కిషన్ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిం చాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, కిషన్ తన విధి నిర్వహణలో ఆదాయానికి మించిన భారీ ఆస్తులను సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలు సహా పలు విభాగాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, బ్యాంకు లావాదేవీల ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పలు లోతైన విచారణ అవసరమని ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల మూలాలు, వస్తువుల పాత్రలు, బినామీ లావాదేవీల కోణం, ఇతర అధికారులతో ఉన్న వారిపై స్పష్టత కోసం కస్టడీ అవసరమని ఈసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లో వివరించారు.
ఈ కారణంగానే కిషన్ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆదేశించింది. ఈ కేసులో కీలకంగా పలువురు వ్యక్తులను విచారించాల్సి ఉంది, మరిన్ని డాక్యుమెంట్లు సేకరించాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కస్టడీ లభిస్తే ఈ దర్యాప్తు మరింత వేగంగా, సమగ్రంగా సాగుతుందని భావిస్తున్నట్లు కోర్టులో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై రేపు ఏసీబీ విచారణ జరపనుంది. కోర్టు తీసుకునే నిర్ణయంతో కేసు కీలక మలుపులు తిరిగే అవకాశంగా సమాచారం.
