25 డిసెంబర్, 2025 12:13PMన పోస్ట్ చేయబడింది

ఇప్పటికే టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరూ కేవలం వీధుల్లోనే కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడితే చూడాలని అభిమానులు తపిస్తున్న నేపథ్యంలో వచ్చింది.. విజయ్ హజారే ట్రోఫీ. సఫారీలతో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ప్రముఖంగా నిర్వహిస్తున్నప్పుడు. ఈ టోర్నీలోనూ రో-కో పరుగుల వరద పారిస్తున్నారు.
జైపూర్ వేదికగా సిక్కింతో బుధవారం (డిసెంబర్ 24) జరిగిన మ్యాచ్లో ముంబై దూకుడు ప్రదర్శించారు. మొదట బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. అనంతరం 237 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబై 30.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయింది 237 పరుగులు చేసి ఆటను ముగించింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ 94 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా ముంబై ఛా రాజా అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా హిట్మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఇక ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం. ఈ మ్యాచ్లో వన్ డౌన్లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదట్టింగ్కి ఆంధ్ర జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకి దిగిన ఢిల్లీ 27.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది 220 పరుగులు చేసింది. ఆ స్టేజ్లో కోహ్లీతో కలిసి ప్రియాంక్ ఆర్య(74) రాణించడతో ఢిల్లీ 37.4 ఓవర్లో సునాయాసంగా విజయం సాధించింది.
