డిసెంబర్ 20, 2025 4:15PMన పోస్ట్ చేయబడింది

ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరగడం లేదా బీపీ సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపీ నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలోని ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హైబీపీతో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపీ ఎందుకు ఎక్కువ? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
ఉప్పు డేంజర్ ఇందుకే..
ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి. గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం, బలహీనమైన వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది. దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు.
బ్రెడ్, బన్.. బేకరీ..
రోజూ బ్రెడ్ లేదా బాన్ తినేవారు చాలామంది ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు. కానీ ఈ బ్రెడ్ లేదా బాన్ లు శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థాలలో చాలా సోడియం, షుగర్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్లలో లభించే స్నాక్స్, బిస్కెట్లు, చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వందే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా, బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది.
వీటిలో చాలా ఎక్కువ..
టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్విచ్ స్, ప్యాక్ చేసిన చట్నీలు, ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు.. వీటి ఆఫీస్ లైఫ్ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడిస్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్లు, క్రాకర్లు, బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్లో కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు.
చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్లు, ఫ్లేవర్డ్ బటర్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది. అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం, టెక్చర్ కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాల్లో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పుతో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపీ తగ్గుముఖం పడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…
