డిసెంబర్ 16, 2025 11:16AMన పోస్ట్ చేయబడింది

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో వారిరువురితో పాటు మరో ఐదుగురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) దాఖలు చేసిన చార్జిషీట్ను తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం (డిసెంబర్ 16) నిరాకరించింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తులను ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ను సొంతం చేసుకున్నట్లు ఈడీ చెబుతోంది.
కాగా ఎఫ్ఐఆర్ లేకుండా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి దాఖలు చేసిన ఫిర్యాదును సమర్థించలేమని ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. కాకుండా ఇదే కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని అంతే కోర్టు, ఇప్పుడు ఈడీ చార్జిషీటుపై ముందస్తుగా స్పందించలేదు.
నేషనల్ హెరాల్డ్ మాతృసంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్(ఏజే)ను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నట్లు కుట్రపన్నారని ఆరోపిస్తూ సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విదేశీ విభాగం చీఫ్ శామ్ పిడా సహా ఐదుగురిపై ఆర్థిక నేరాల విభాగం గత నెలలో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈడి అందించిన సమాచారం ఆధారంగా ఇఒడబ్ల్యు ఈ నివేదికను సమర్పించింది.
.webp)