డిసెంబర్ 13, 2025 12:34AMన పోస్ట్ చేయబడింది

రెండో తెలంగాణ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన ఇది. మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం డీ కొంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం ఆసుపత్రికి మృతదేహం. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సిటీవీ ఫుటేజ్ ను చూస్తున్నారు.
ఆదివారం (డిసెంబర్ 14) పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం (డిసెంబర్ 14) బయలుదేరిన ఈ కుటుంబం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం మాగీ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణం తీసిన ఓటు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.webp)