
-ఎవరు ఆ హీరో
-ఫ్యాన్స్ ఏమంటారో
-సాయి పల్లవి ఛరిష్మానే వేరు
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ‘సాయిపల్లవి'(సాయి పల్లవి)చరిష్మాకి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. చాలా కాలం తర్వాత హీరోయిన్ ని చూసి సినిమాకి వెళ్లే రేంజ్ ని సంపాదించి హీరోయిన్ కట్ అవుట్ కి గుర్తింపు తెచ్చింది. అందుకే అనతికాలంలోనే ప్రపంచ సినీ విశ్లేషకులు ఔరా అనుకునే రీతిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణం'(రామాయణం)లో సీతమ్మ తల్లి క్యారక్టర్ ని పోషిస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(మణిరత్నం)’థగ్ లైఫ్’ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ‘విజయ్ సేతుపతి'(విజయ్ సేతుపతి)తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆ చిత్రం గురించి అధికార ప్రకటన రానుంది. విజయ్ సేతుపతి సరసన ‘సాయి పల్లవి’ని మేకర్స్ హీరోయిన్ గా ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విజయ్ సేతుపతి వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన కట్ అవుట్ అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దీంతో విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి సెట్ అవుతుందా కూతురిగా ఉంటుందనే కామెంట్స్ ని కొందరు చేస్తున్నారు.
కూడా చదవండి: సంక్రాంతి విన్నర్ ఎవరు.. మీకు తెలుసా!
మరికొంత మాత్రం ఈ విషయంపై విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబో కొత్తగా కనిపిస్తున్నారని, ఇద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో తేడా ఉందని, సినిమా అనే అద్భుతమైన దృశ్య కావ్యం ఆ ఛాయలు కనపడకుండా పోతున్నాయని అంటున్నారు. ఒక అందమైన ప్రేమకథగా మణిరత్నం ప్రదర్శించిస్తుండటం మరో స్పెషల్. విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీతో ప్రస్తుతం ఉన్నాడు.

