Home Latest News గోవాలో భారీ అగ్ని ప్రమాదం…23మంది మృతి | గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం| గోవా| నైట్ క్లబ్| అగ్ని ప్రమాదం| అర్పోరా| సీఎం ప్రమోద్ సావంత్| మైఖేల్ లోబో| ప్రమాదం| భారతదేశం – Andhra Waves

గోవాలో భారీ అగ్ని ప్రమాదం…23మంది మృతి | గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం| గోవా| నైట్ క్లబ్| అగ్ని ప్రమాదం| అర్పోరా| సీఎం ప్రమోద్ సావంత్| మైఖేల్ లోబో| ప్రమాదం| భారతదేశం – Andhra Waves

by andhra andhrawave
0 comments
గోవాలో భారీ అగ్ని ప్రమాదం...23మంది మృతి | గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం| గోవా| నైట్ క్లబ్| అగ్ని ప్రమాదం| అర్పోరా| సీఎం ప్రమోద్ సావంత్| మైఖేల్ లోబో| ప్రమాదం| భారతదేశం


డిసెంబర్ 7, 2025 9:41AMన పోస్ట్ చేయబడింది


గోవా రాష్ట్రాన్ని మరోసారి విషాదం కమ్మేసింది. ఉత్తర గోవా ఆర్పోరాలోని రోమియో లెన్‌లో ఉన్న ప్రముఖ బిర్చ్ నైట్ క్లబ్‌లో అర్థరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 23 మంది ప్రాణాలను బలిగొంది. క్లబ్ కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిశాయి. మంటలు క్షణాల్లోనే మొత్తం ప్రాంగణాన్నే చుట్టేసి నైట్ క్లబ్‌ను అగ్నికి ఆహుతి చేశాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులతో సహా మొత్తం 23 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అందులో ముగ్గురు సజీవదహనం కాగా, మిగిలిన వారు తీవ్రమైన పొగలతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. జరిగిన సమయంలో క్లబ్‌లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నారని… ప్రాణనష్టం పెరగడానికి ప్రధాన కారణం అధికారులు.అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

అయితే ఇప్పటికే పలు ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల గుర్తింపు కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని అధికారులు.

ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో నైట్ క్లబ్‌లు, పర్యాటక వేదికలపై కఠినమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఈ ఘటన జరగడంతో రోమియో లెన్ ప్రాంతం మొత్తం విషాద వాతావరణంలో మునిగిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను, పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమా? లేదా భద్రతా ప్రమాణాల లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గోవాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird