గత 26 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కొనసాగుతున్న సంస్థ తెలుగువన్. ఇండియాలోనే ప్రప్రథమంగా యూట్యూబ్కి లింక్ అయిన తొలి ఛానల్గా తెలుగువన్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివిధ కేటగిరీల్లో అందరికీ ఉపయోగపడే ఛానల్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తెలుగువన్ 2024లో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది.
రైతుల సమస్యలు ప్రధానంగా తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘రాజధాని ఫైల్స్’ నిర్మించారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందర్నీ ఆలోచింపజేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు తెలుగు వన్ ప్రొడక్షన్స్ సంస్థ తమ రెండో విషయాన్ని ప్రకటించింది.
తన బర్త్ డే సందర్భంగా తాము నిర్మించబోయే రెండో చిత్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ నిర్మించడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు కంఠంనేని రవిశంకర్. పంచభూతాలను ప్రధాన కథా వస్తువుగా తీసుకొని సినిమాకి అనుగుణంగా దాన్ని విస్తరించి ఒక భారీ ప్రదర్శనకు రంగం సిద్ధం చేస్తున్నారు.
తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు మే 19. తెలుగు స్టాఫ్తోపాటు పలువురు ఆయన పుట్టినరోజు వేడుకలో సందడి. తెలుగువన్ డైరెక్టర్ రమేష్ ఈ వేడుకలో పాల్గొని కంఠంనేని రవిశంకర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, తెలుగు ప్రొడక్షన్స్లో నిర్మాణం జరపుకోనున్న రెండవ చిత్రం మంచి విజయం సాధించాల ని ఆకాంక్ష.
ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేయడమే కాకుండా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ సినిమాకి రచిస్తున్నారు. 2027 సమ్మర్లో ఈ విడుదల చేసే విధంగా ఇప్పటి నుంచే ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించామని దర్శకనిర్మాత కంఠంనేని రవిశంకర్ తెలియజేశారు.
తెలుగువన్ ప్రొడ క్షన్స్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మాణం జరుపుకోనుకున్న ఈ కె.హిమబిందు సమర్పిస్తున్నారు. సహ’నిర్మాత’గా వై.జతిన్కుమార్ వ్యవహరిస్తారు. జనార్థన మహర్షి రచనలో నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రం కాన్సెప్ట్, దర్శకుడు నిర్మాత: రవిశంకర్ కంఠంనేని.