ఆరోగ్యం విషయంలో హెర్బ్స్ ప్రభావవంతంగా పని చేస్తుందని రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. రిలీఫ్ వెల్నెస్ సంస్థ మార్కెట్లోకి కొత్తగా ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. రిలీఫ్ వెల్ఫేర్ కొత్తగా తీసుకొచ్చిన 18 రకాల ఆయుర్వేద ఉత్పత్తులను శుక్రవారం (ఫిబ్రవరి 20) ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ కూడా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు వేల ఏళ్ల ఆయుర్వేదజ్ఞానాన్ని, ఆధునిక వైద్యశాస్త్రానికి అనుసంధానించలేమ, అలోపతి మెడిసిన్ లా ప్రభావమంతమైన ఆరోగ్యరక్షకు ఉపయోగించాలన్న లక్ష్యంతో తొమ్మిదేళ్ల పరిశోధనలు చేసి స్మాల్ మాలిక్యూల్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వాస్తవానికి సహజసిద్ధ్లోనే ఆరోగ్యం దాగుందని ఆయన అన్నారు. తాము తీసుకువచ్చిన ఈ టెక్నాలజీ ఆయుర్వేదం, ఫార్మాస్యూటికల్ సైన్స్ మధ్య అంతరాన్ని తాము సరఫరా చేసిన ఉత్పత్తులను ఫిల్ చేస్తోందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.
ఎలాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఈ తరహా మందులు రావాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మురళీమోహన్ అన్నారు. ఇక ఈ ఉత్పత్తులను ఆవిష్కరించిన నటి కాజోల్ ఈ తరహా విజ్ఞానం సమాజానికి ఎంతో అవసరమని తెలియజేసారు. ప్రస్తుతానికి తమకు అందించిన ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులో ఉన్నామని, త్వరలోనే ఓపెన్ మార్కెట్లోకి తీసుకువస్తామని రిలీఫ్ వెల్నెస్ సీఈవో తరుణ్ సింగ్ మచౌహాన్ తెలిపారు.
