
-అభిమానుల్లో టాక్సిక్ టెన్షన్
-రిలీజ్ డేట్ ఆగదు కాదా
-టాక్సిక్ యూనిట్ చేసిన నేరం ఏంటి
-అసలు ఏం జరుగుతుంది
‘టాక్సిక్'(టాక్సిక్)ద్వారా మరోసారి వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు యష్. కేజిఎఫ్ సిరీస్ సక్సెస్ ఆ సిరీస్ ఇచ్చిన కిక్ ని మించిన కిక్ అభిమానులని అందించిన తర్వాత యష్ కోరిక. అందుకే చాలా గ్యాప్ తీసుకొని ఏరి కోరి టాక్సిక్ ని ఎంచుకున్నాడు. దీన్ని బట్టి టాక్సిక్ పై యష్ కి ఉన్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు కూడా అదే నమ్మకంతో రిలీజ్ డేట్ మార్చి 19 కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాంటి టాక్సిక్ ముందు వరుస వివాదాలు కవచ కుండలాలుగా అంటి పెట్టుకుంటున్నాయి. ఆ కోవలోనే రీసెంట్ గా టాక్సిక్ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
టాక్సిక్ షూటింగ్ బెంగళూరులోని పీణ్య, జలహళ్లి దగ్గరలోని సమీప ప్రాంతంలో కూడా జరిగింది. ఇక్కడ షూటింగ్ జరిగిన అన్నిరోజులు చిత్ర యూనిట్ ఎలాంటి అనుమతి లేకుండా వేలాది చెట్ల నరికేశారని కర్ణాటక రాష్ట్ర శాఖ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్లో షూటింగ్ యూనిట్తో పాటు భూమిని లీజుకి ఇచ్చిన వారిపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.ఈ విషయంపై శాఖ మంత్రి స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి సోషల్ మీడియాలో పిక్స్ ని పోస్ట్ చేయడంతో వివాదం ముదిరింది. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కూడా చదవండి: Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు
ఆల్రెడీ టాక్సిక్ టీజర్ అంశం వివాదాలలో ఉంది. ఇప్పుడు చెట్లని కూడా నరికివేసారనే ఆరోపణలు రావడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దృశ్యాలు సినిమా రిలీజ్ కి సంబంధించిన విషయాల వలన ఆటంకం ఎదురుకాకుండా చూసుకోవాలని మేకర్స్, యష్ ని కోరుతున్నారు. టాక్సిక్ అయితే డార్క్, ఇంటెన్స్ టోన్తో అంతర్జాతీయ ప్రమాణాలతో మహిళా దర్శకురాలు గీతు మోహన్దాస్(గీతు మోహందాస్)తెరకెక్కించింది. టెక్నీకల్ గా కూడా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ పదే పదే చెప్తున్నారు. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. కియారా అద్వానీ(కైరా అద్వానీ),నయనతార(నయనతార),రుక్మిణి వసంత్(రుక్మిణి వసంత్),తార సుతారియా,టోమినో థామస్, హుమా ఖురేషి ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు.
