తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలపై కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు ఏ3గా ఉన్న హీరో మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల తాను ఈ నెల 15వ తేదీ వరకు అక్కడ ఉండనని, అటు తర్వాత వస్తానని విష్ణు. సమాధానం ఇచ్చారు. ఈ కేసులో వర్సిటీ పీఆర్ఓ సతీష్ A-1 సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో A2గా ఉన్న నటుడు మోహన్ బాబుకు నోటీసులు అందలేదు.
ఇటీవల యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన మోహన్బాబు. ఈ నిరసనల అనంతరం ఎస్ఎఫ్ఐ నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మంచు విష్ణుపై కేసు నమోదు కాగా, విచారణకు హాజరుకావడంతో తాజాగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.బాధితువుల వాంగ్మూలాలు, ప్రాథమిక ఆధారాల ప్రకారం యూనివర్సిటీ యాజమాన్యం మేరకే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
