జనవరి 26, 2026 1:14PMన పోస్ట్ చేయబడింది

సోషల్ మీడియా వేదికగా వచ్చే ప్రచారాలన్నీ కొంతమంది బాగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మల్లా పూర్ ప్రాంతంలో ఇటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొంతమంది నిర్వహకులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని “కేవలం రూ.26 వేల రూపాయలకే కారు” అంటూ ఇన్స్టాగ్రామ్లో బాగా ప్రచారం చేశారు… అది నిజమని నమ్మిన వందలాది మంది ఘటన స్థలానికి చేరుకున్నారు. తాము మోసపోయామని గ్రహించిన జనాలు ఆగ్రహంతో ఊగిపోతూ నిర్వాహకులపై రాళ్లతో దాడి చేయడంతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. కేవలం 22 వేలకే కారు అంటూ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటన వైరల్ అయ్యింది.
ఈ ప్రకటనను నమ్మిన ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మల్లాపూర్కు చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన కారులో స్పష్టత లేకపోవడం, నిర్వాహకులు సరైన సమాధానాలు ఇచ్చిన తర్వాత ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. కొంతమందికి డబ్బులు చెల్లించామని, కానీ వాహనం ఇవ్వడం లేదని. ఆగ్రహించిన జనాలు నిర్వాహకులకు సంబంధించిన కార్లపై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
పరిస్థితి మరింత దిగజారకుండా ప్రచారం నిర్వహించిన నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్లో చేసిన ప్రచారం నిజమా? ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో ఈ ఆఫర్ పెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన కారణంగా మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా జనాలు రోడ్ల మీదికి రావడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించింది. వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా తక్కువ ధరల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ధృవీకరణ లేని ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లించలేదని పోలీసులు తెలిపారు.
