పోస్ట్ చేయబడింది జనవరి 20, 2026 1:11PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పుట్టినరోజు నాడు పెద్ద ఎత్తున ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించేందుకు అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ నేతలు తెలిపారు.
నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న మడకశిరలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ చేతుల మీదుగా వాటిని అందజేయడంతోపాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితెలిపారు. మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన సభాస్థలిని ఆయన సోమవారం (జనవరి 19) పరిశీలించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాలు ఉన్నాయి.
