డిసెంబర్ 19, 2025 8:54AMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత లోతైన, సమగ్ర దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మంజూరు మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సిట్లో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ వైసీపీ వెంకటగిరి, డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.
ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ ఎడ్యుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు సంబంధిత అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్వర్డ్లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నిజజాతులను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ కేసులో సిట్కు విస్తృత అధికారాలు కల్పించినట్లు తెలుస్తోంది.
