Home Latest News వెంటపడ్డ వీధి కుక్కలు…నిండు ప్రాణం బలి | వీధి కుక్కలు| సుప్రీంకోర్టు| షేక్ పజిల్| రాయచోటి| అన్నమయ జిల్లా| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| మంత్రి నారాయణ| హోంమంత్రి అనిత – Andhra Waves

వెంటపడ్డ వీధి కుక్కలు…నిండు ప్రాణం బలి | వీధి కుక్కలు| సుప్రీంకోర్టు| షేక్ పజిల్| రాయచోటి| అన్నమయ జిల్లా| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| మంత్రి నారాయణ| హోంమంత్రి అనిత – Andhra Waves

by andhra andhrawave
0 comments
వెంటపడ్డ వీధి కుక్కలు...నిండు ప్రాణం బలి | వీధి కుక్కలు| సుప్రీంకోర్టు| షేక్ పజిల్| రాయచోటి| అన్నమయ జిల్లా| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| మంత్రి నారాయణ| హోంమంత్రి అనిత


డిసెంబర్ 8, 2025 8:06PMన పోస్ట్ చేయబడింది


వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పన్నే సృష్టిస్తున్నాయి. ఇలాంటి విషాదం స్పందించిన సుప్రీంకోర్టు వీధి కుక్కలను అక్కడి నుంచి తరలించాలని , ఆహారం పెట్టకూడదని సూచించారు .అయినా సంఘటన కూడా వీధి కుక్కల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులు తాజాగా సోమవారం వీధి కుక్కలు వెంట పడ్డ ఘటన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో చోటు చేసుకుంది.

మోటారు సైకిల్ వెలుతున్న ఓ వ్యక్తిని కుక్క వెంబడించడంతో భయపడిన వ్యక్తి వేగంగా వెలుతూ ఆలయాన్ని ఢీ కొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన ట్రాఫిక్ ఎస్.ఐ కుళాయప్ప కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులో నివాసం ఉంటున్న షేక్ పజిల్ (28) అనే వ్యక్తి కి కడప రోడ్డులో ఫర్నీచర్ షాపు వుంది. ఆ షాపును ఇటీవలే చిత్తూరు రోడ్డుకు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వుండడంతో షిప్టింగ్ పనులు ముగించుకొని సోమవారం తెల్లవారు జామున 2.45 గంటల సమయంలో మోటార్ సైకిల్ పై ఇంటికి బయలు దేరారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అపోలో మెడికల్ స్టోర్ వద్ద అతన్ని వీధి కుక్క వెంబడించాయి.

దీనితో కుక్కల బారి నుండి తప్పించుకోవాలన్న భయాందోళనకు గురై వేగంగా వెలుతూ సమీపంలోని రెండు అడుగుల కింద వున్న రామాలయం గోడను ఢీ కొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి గుర్తించారు. మృతుడు జీవనోపాధి కోసం సౌదీ కి వెళ్లగా పెళ్లి చేసుకోవాలని మూడు నెలల క్రితమే ఇండియాకు రావడం, అంతలోనే ఇలా జరగడం పట్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

*ఇప్పటికైనా అధికారులు సూచించారా.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వీధి కుక్కలపై సీరియస్ అయింది. అమెరికాకు వాటిని వీధులు లేకుండానే కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాలను ఆదేశించింది.అంతేకాదు ఇటీవల వాటిని తరలించేందుకు ఏ మేరకు చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా కోరింది .అయినా కూడా వీధి కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్న చర్యలు కనిపించడం లేదు . రాయచోటిలో జరిగిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird