డిసెంబర్ 8, 2025 12:08PMన పోస్ట్ చేయబడింది

మ్యూజీషియన్ పలాశ్ ముశ్చల్ తో మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం జరిగింది. ఈ పరిశీలన స్మృతి మంధాన స్వయంగా చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. పలాష్ తో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం గత నెల 23న మంధాన, పలాశ్ ల వివాహం జరగాల్సి ఉంది. అయితే మంధానా అనారోగ్యం కారణంగా వాయిదా పడిందని ఆ రోజు చెప్పారు. అప్పటి నుంచీ స్మృతి మంధానా వివాహంపై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ తెర దించుతూ తాజాగా స్మృతి మంధాన తమ వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితం గురించి ఫుల్ స్టాప్ పెట్టాలనే తానీ పరిశీలన వెల్లడిస్తున్నట్లు ఆమె.. తన వివాహం చుట్టూ జరిగిన చర్చ తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. ఈ విషయానికి ముగింపు పలకాలని ఆమె ఖచ్చితంగా ఉంది. తమ కుటుంబ ప్రైవసీకి గౌరవం ఇస్తూ తన వివాహం విషయంలో ఊగాహన సభలకు ముగింపు పలికారు.
ఇలా ఉండగా.. ఈ వివాహం నిశ్చితార్ధం తరువాత రద్దు కావడానికి పలాష్ ముష్కర వ్యవహారమే కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి పలాష్ ముచ్చల్ పెద్దగా పెద్దగా పేరు లేని మ్యూజిక్ డైరక్టర్. చాలా కాలంగా స్మృతితో ప్రేమలో ఉన్నారు. ఈ విధంగానే వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తరువాత పలాశ్ మశ్చల్ వ్యవహారశైలిపై పలు అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఓ డాన్స్ మాస్టర్ తో ఎఫైర్, మరో మోడల్ తో అభ్యంతరకర ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆకారణంగానే పెళ్లి రద్దు అయినట్లుగా కనిపిస్తోంది.
